న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టాప్స్(టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్), ఖేలో ఇండి యా పథకాలతో క్రీడాకారులు ఆర్ధిక సమస్యలను అధిగమిస్తున్నారని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ వెల్లడించింది. పై రెండు పథకాల ద్వారా ప్రభుత్వం క్రీడాకారులకు అవసరమైన ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నదని, క్రీడాకారులు ఆయా క్రీడల్లో రాణించేందుకు ఇపుడు ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నది.
గతంలో ఇండియాకు ప్రాతినిథ్యం వహించేందుకు తమ సొంత డబ్బును వినియోగించాల్సి వచ్చేదని, ఇపుడు అటువంటి పరిస్థితి లేదన్నది. పై రెండు పథకాలవల్ల ఆటగాళ్లు ముఖ్యంగా మహిళా అథ్లెట్లకు ఆర్ధికంగా ఆసరా లభిస్తున్నదని తెలిపింది. దీనివల్ల ఆటపై మరింత దృష్టి సారించేందుకు అవకాశం కలుగుతున్నదని పేర్కొంది.