జకార్తా: ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న భారత షట్లర్లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు. ప్రణయ్ ఇటీవల మలేషియా మాస్టర్స్ టైటిల్ నెగ్గి జోష్లో ఉండగా..
బీడబ్ల్యూఎఫ్ సూపర్-1000 టోర్నీలో మన షట్లర్లకు కఠిన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్లో కెంటా నిషిమొటోతో ప్రణయ్, గాంగ్ జూతో శ్రీకాంత్, లీ జీ జియాతో లక్ష్యసేన్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్లో జార్జియా మరిస్కాతో పీవీ సింధు ఆడనుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.