న్యూఢిల్లీ : భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని 7వ ర్యాంక్కు చేరుకున్నాడు. కాగా కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేతలు, భారత మహిళల జోడి గాయత్రి గోపీచంద్-త్రిసా జాలి రెండు స్థానాలు మెరుగై 15వ ర్యాంక్లో నిలిచారు.
ప్రణయ్ ఈ యేడాది 17 టోర్నీలలో 66,147 పాయింట్లు సాధించి భారత ఆటగాళ్లలో ఉత్తమ స్థానంలో నిలిచాడు. భారత మహిళల అగ్రశ్రేణి క్రీడాకారిణి పివి సింధు సింగిల్స్లో ఒక స్థానం మెరుగై 11వ ర్యాంక్కు చేరుకుంది. లక్ష్య సేన్ 22, కిడాంబి శ్రీకాంత్ 23 ర్యాంక్లలో నిలిచారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి రెండు స్థానాలు దిగజారి 7 ర్యాంక్కు చేరుకున్నారు. కాగా ఇతర భారత క్రీడాకారులెవరూ టాప్20లో స్థానం దక్కించుకోలేకపోయారు.