ఆంటాల్య: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్కు మరో పతకం ఖాయమైంది. రికర్వ్ మిక్స్డ్లో భారత జోడీ రిధి పోర్- తరుణ్దీప్ రాయ్ ఫైనల్కు దూసుకెళ్లింది. టర్కీ వేదికగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో రిధి-తరుణ్దీప్ ద్వయం 5-3 (38-35, 36-39, 38-38, 36-35)తో జపాన్ జోడీని చిత్తు చేసింది. ఆదివారం స్వర్ణ పోరులో పదకొండో సీడ్ బ్రిటన్ జంటతో మన జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే కాంపౌండ్ పురుషుల పోరులో ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టు అభిషేక్ వర్మ, రాజత్ చౌహాన్, అమన్ సైనీ శనివారం ఫ్రాన్స్ బృందంతో తలపడనుంది.