బెర్లిన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత రికర్వ్ ఆర్చర్లకు నిరాశే ఎదురైంది. పారిస్ (2024) ఒలింపిక్స్కు తొలి అర్హత టోర్నీ అయిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. భారీ అంచనాల మధ్య రెండో సీడ్గా బరిలోకి దిగిన బొమ్మదేవర ధీరజ్తో పాటు సిమ్రన్జీత్కౌర్ ప్రిక్వార్టర్స్లో వెనుదిరిగారు.
ఇప్పటికే టీమ్ఈవెంట్లలో నిరాశపరిచిన ఆర్చర్లు వ్యక్తిగత విభాగాల్లోనూ పతకాలు లేకుండానే తమ పోరాటాన్ని ముగించారు. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న ధీరజ్ ప్రిక్వార్టర్స్లో 4-6(18-25, 24-22, 26-26, 28-25, 25-25)తో రికార్డో సొటో (చిలీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. తీవ్ర ఒత్తిడికి లోనైన ధీరజ్ లక్ష్యానికి అనుగుణంగా బాణాలు సంధించడంలో విఫలమయ్యాడు. టోర్నీలో కాంపౌండ్ విభాగంపైనే భారత్కు పతక ఆశలు మిగిలున్నాయి.