ఆర్లియన్స్(ఫ్రాన్స్) : ఆర్లియన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు సమీర్వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలి గేమ్లో గెలుపొందినా దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన సమీర్ 21-19, 19-21, 17-21 స్కోరుతో ఐర్లాండ్కు చెందిన నహత్ ఎంగ్యుయెన్ చేతిలో ఓడిపోయాడు.
కాగా ఇండియా ఆటగాళ్లు మిథున్ మంజునాథ్, ప్రియాంశు రజావత్లు రెండో రౌండ్కు చేరుకున్నారు. మంజునాథ్ తనకంటే మెరుగైన ర్యాంకింగ్ కలిగిన వికోటర్ స్వెండ్సన్ను 24-22, 25-23తో ఓడించగా, రజావత్ స్వదేశానికే చెందిన కిరణ్ జార్జిని 21-18, 21-13తో ఓడించాడు.