జాగ్రెబ్:ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత ప్యాడర్ల హవా కొనసాగుతున్నది. తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ భారత యువ ద్వయం ఆకుల శ్రీజ, దివ్య చితాలె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్లో శ్రీజ, దివ్య 9-11, 12-10, 11-7, 5-11, 11-8తో సింగపూర్ జోడీ జిన్ రు వాంగ్, జియాన్ జెంగ్పై అద్భుత విజయం సాధించింది.
తొలి గేమ్ను ప్రత్యర్థికి కోల్పోయిన శ్రీజ, దివ్య జంట ఆ తర్వాత పుంజుకుని వరుస గేముల్లో మ్యాచ్ను కైవసం చేసుకుంది. 39 నిమిషాల పాటు సాగిన పోరులో భారత ప్యాడ్లర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. శనివారం జరిగే సెమీస్లో థాయ్లాండ్తో ద్వయంతో తలపడుతారు.