Manika Batra | న్యూఢిల్లీ: భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రాకు చేదు అనుభవం ఎదురైంది. పెరూలో డబ్ల్యూటీటీ టోర్నీ ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన మనిక లగేజ్ కోల్పోయింది. ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో తన పోరాటాన్ని ముగించిన మనిక స్పోర్ట్స్ కిట్ను పోగొట్టుకుంది. విలువైనవి అని పేర్కొన్న ట్యాగ్ ఉన్నా..తన లగేజ్ పోవడంపై ఈ స్టార్ ప్యాడ్లర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
లగేజ్ విషయంలో విమానయాన సంస్థ నుంచి సరైన రీతిలో స్పందన లభించలేదని పేర్కొంది.రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీల కోసం కొనుగోలు చేసిన స్పోర్ట్స్ కిట్ కోల్పోవడంపై కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్యకు మనిక ఫిర్యాదు చేసింది. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.