న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి మెడల్ తెచ్చిన మీరాబాయ్ చాను కోచ్ విజయ్ శర్మకు రూ.10 లక్షల నగదు బహుమతి దక్కనున్నది. టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన అథ్లెట్ కోచ్లకు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) నగదు బహుమతులు ప్రకటించింది. బంగారు పతకం సాధించే అథ్లెట్ కోచ్కు రూ.12.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించే అథ్లెట్ కోచ్కు రూ.10 లక్షలు, కాంస్య పతకం విజేత అథ్లెట్ కోచ్కు రూ. 7.5 లక్షలు ఇవ్వనున్నారు.
కాగా, టోక్యో ఒలింపిక్స్ తొలి రోజున వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆమె కోచ్ విజయ్ శర్మకు రూ.10 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా శనివారం తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మెడల్స్ తెచ్చే అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే వారికి ఇచ్చే నగదు బహుమతి వారి మనోధైర్యాన్ని పెంచడంతోపాటు ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.