టోక్యో: ఒలింపిక్స్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్ చేరిన ఇండియన్ హాకీ టీమ్ విజయ పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది. ఈ విజయంతో గ్రూప్ ఎలో టీమిండియా రెండో స్థానంతో లీగ్ స్టేజ్ను ముగించింది. మొత్తం ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచి, ఒకదాంట్లో ఓడిన భారత్.. 12 పాయింట్లతో ఆస్ట్రేలియా (13) తర్వాతి స్థానంలో ఉంది. జపాన్తో మ్యాచ్లో గుర్జంత్ సింగ్ 2, హర్మన్ప్రీత్ సింగ్, షంషేర్, నీలకంఠ శర్మ తలా ఒక గోల్ చేశారు.