న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో బరిలోకి దిగే భారత పురుషుల హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ కోసం హాకీ ఇండియా సోమవారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
హర్మన్ప్రీత్ సింగ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మెగాటోర్నీలో ఇంగ్లండ్, కెనడా, వేల్స్, ఘనాతో కలిసి గ్రూప్-బిలో ఉన్న భారత్.. జూలై 31న ఘనాతో తొలి మ్యాచ్ ఆడనుంది. టోక్యోలో మన్ప్రీత్ సారథ్యంలో కాంస్యం సాధించిన భారత్.. అదే స్ఫూర్తితో కామన్వెల్త్ స్వర్ణం చేజిక్కించుకోవాలని భావిస్తున్నది.