న్యూఢిల్లీ :భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్లో మన హాకీ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ 58 ఏళ్ల రీడ్ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి రాజీనామా సమర్పించాడు. 2019 ఏప్రిల్లో భారత జట్టు కోచ్గా నియమితుడైన రీడ్ చెప్పుకోదగ్గ ఫలితాలను అందించాడు.
ముఖ్యంగా 41 ఏళ్ల తరువాత ఒలింపిక్స్లో పతకం(టోక్యోలో కాంస్యం) అందించాడు. గత ఏడాది బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం, ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొలీగ్ 2021-22 సీజన్లో మూడో స్థానం పొందేలా జట్టును తీర్చిదిద్దాడు.