పటియాల: భారత వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగనుంది. మంగళవారం జాతీయ ఇంటర్స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల పోటీలో డిస్క్ను 63.70 మీటర్లు విసిరిన సీమ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. మరోవైపు భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది.