లండన్: భారత క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామి తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికింది. రెండు దశాబ్దాల పాటు తన ఆటతీరుతో అభిమానులను అలరించిన జులన్.. ఇంగ్లండ్తో మూడో వన్డే ద్వారా గుడ్బై చెప్పింది. ఇంగ్లండ్పై 2002లో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ 39 ఏండ్ల వెటరన్ పేసర్ టీమ్ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమైంది. సుదీర్ఘ కెరీర్లో భారత్ తరఫున జులన్ 12 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడింది.