న్యూఢిల్లీ: తొలి ద్రోణాచార్య అవార్డు గ్రహీత, బాక్సింగ్ కోచ్ ఓపీ భరద్వాజ్ (82) కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. 10 రోజుల క్రితమే ఆయన భార్య కూడా అనారోగ్యం వల్ల చనిపోయారు. ద్రోణాచార్య అవార్డు ప్రవేశపెట్టిన 1985లోనే భగవత్ (రెజ్లింగ్), నంబియార్ (అథ్లెటిక్స్)తో కలిసి భరద్వాజ్ పురస్కారం అందుకున్నారు. 1968 నుంచి 1989 వరకు భారత జాతీయ బాక్సింగ్ కోచ్గా పని చేసిన భరద్వాజ్ సెలెక్టర్గానూ విధులు నిర్వర్తించారు. ఆయన దిశానిర్దేశంలో చాలా మంది భారత బాక్సర్లు కామన్వెల్త్, ఆసియాలో పతకాలతో సత్తాచాటారు. భరద్వాజ్ మృతి పట్ల బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు.