దోహా : భారత బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ 26వసారి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఫైనల్లో పంకజ్ 1000-416 స్కోరుతో స్వదేశానికే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించాడు. 2005లో తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచిన పంకజ్ ఆ తరువాత 25సార్లు ప్రపంచ టైటిల్స్ సాధించాడు.
సెమీస్లో పంకజ్ 900-273తో రూపేష్ షాపై, సౌరవ్ 900-756తో ధృవ్ సిత్వాలపై గెలుపొంది టైటిల్ పోరుకు చేరుకున్నారు.