దుబాయ్ : ఐసీసీ తాజాగా విడుదల చేసి న టీ20 ర్యాం కింగ్స్లో భార త బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెం డో ర్యాంక్ నిల బెట్టుకున్నాడు. మరో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్నాడు. అతడు ఆరు ర్యాంక్లు మెరుగై 19వ ర్యాంక్కు చేరుకున్నాడు. సూర్యకుమార్ 805 ర్యాంకింగ్ పాయింట్లతో భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన టీ20 సిరీస్లో చివరి మ్యాచ్లో 40 బంతుల్లో 64 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ 578 పాయింట్లు సాధించాడు. ఆల్రౌండర్లలో అఫ్గానిస్థాన్కు చెందిన మహమ్మద్ నబీ నంబర్వన్ ర్యాంక్లో ఉన్నాడు.