మాడ్రిడ్ : భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మంగళవారం నుంచి ఆరంభం కానున్న స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్పై గురిపెట్టారు. గతవారం స్విస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న భారత జోడీ తమ జోరును కొనసాగించాలని చూస్తున్నారు. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, పివి సింధు తిరిగి ఫామ్ను అందుకోవాలని ఆశిస్తున్నారు.
ప్రపంచ 6 ర్యాంక్ భారత జోడీ ఈ సూపర్-300 టోర్నీ తొలి రౌండ్లో జపాన్కు చెందిన అయతొ ఎండొ-యుత టేకీలను ఢీకొంటారు. ఈ యేడాది ఏ టోర్నీలోనూ రెండో రౌండ్ దాటని రెండో సీడ్ సింధు తొలి రౌండ్లో క్వాలిఫయర్తో తలపడనుంది. పురుషుల విభాగంలో మాజీ నంబర్వన్, అయిదో సీడ్ శ్రీకాంత్ తొలి రౌండ్లో థాయిలాండ్కు చెందిన సిథికోమ్ తమసిన్ను ఎదుర్కోనున్నాడు.