న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లో విశేష ప్రతిభ చూపిన షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) నజరానాలు ప్రకటించింది. గత రెండేళ్లలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై విశేష ప్రతిభను ప్రదర్శించారని, వారి ప్రతిభకు గుర్తింపుగా నగదు నజరానా అందించనున్నట్టు బాయ్ అధ్యక్షుడు బిశ్వ శర్మ వెల్లడించారు.
ఇందులో భాగంగా కామన్వెల్త్ స్వర్ణ విజేత పీవీ సింధుకు రూ. 20 లక్షలు దక్కనున్నాయి. సాత్విక్- చిరాగ్ జోడికి రూ. 25 లక్షలు అందనున్నాయి. మొత్తంగా దాదాపు కోటిన్నర రూపాయలు నజరానాగా అందించనున్నారు.