వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) 2022లో 3000 మీటర్ల స్టీపిల్ఛేజ్ను భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే 11వ స్థానంలో ముగించాడు. ఈ విభాగంలో ఫైనల్ చేరిన అవినాష్.. 8:31.75 నిమిషాల్లో రేస్ ముగించాడు. మొరాకోకు చెందిన సూఫియానే ఎల్ బక్కాలి రేస్లో టాపర్గా నిలిచాడు. ఇథియోపియన్ లామేచా గిర్మా రెండో స్థానంలో, కెన్యాకు చెందిన కాన్సెస్లస్ కిప్రూటో మూడో స్థానంలో రేస్ పూర్తిచేశారు.
ఈ డబ్ల్యూఏసీ పోటీల్లో అవినాష్కు ఇది రెండో ఫైనల్ కావడం గమనార్హం. హీట్ విభాగంలో 8:18.75 నిమిషాల్లో రేస్ ముగించిన అవినాష్ దీనిలో కూడా ఫైనల్ చేరాడు. అతని ప్రయత్నాన్ని అభినందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్).. ‘‘అద్భుతమైన పోరాటం కనబరిచావు. ఇదే మొమెంటం కొనసాగించు’’ అని ట్వీట్ చేసింది. జాతీయ స్థాయిలో 3000 మీటర్ల స్టీపిల్ ఛేజ్లో అవినాష్ రికార్డు హోల్డర్.