ఓవల్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final) టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సీమ్, పేస్కు అనుకూలించే ఈ పిచ్పై ముందుగా బౌలింగ్ చేయాలని రోహిత్ భావించాడు. టీమిండియా ఈ ఫైనల్కు నాలుగు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్కు చోటు దక్కలేదు. అశ్విన్ను వదిలేయడం టఫ్ నిర్ణయమే అన్నాడు. అతను మ్యాచ్ విన్నర్ అని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అశ్విన్ను వదిలేయడం తప్పలేదని రోహిత్ పేర్కొన్నాడు. కేఎస్ భరత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
🚨 A look at #TeamIndia's Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/0nYl21pwaw #WTC23 pic.twitter.com/hwieFxazre
— BCCI (@BCCI) June 7, 2023
ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా ముందు బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ తెలిపాడు. ఆస్ట్రేలియా తరపున స్కాట్ బోలాండ్ ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. ఆ ఫాస్ట్ బౌలర్ ఇంగ్లండ్లో ఆడడం ఇదే తొలిసారి.
Playing XIs for the #WTC23 Final 👀
📝: https://t.co/5IR0QKx6Pf pic.twitter.com/ngDIAC8HG7
— ICC (@ICC) June 7, 2023
ఆసీస్ జట్టు: వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, కమ్మిన్స్, లియాన్, బోలాండ్
భారత జట్టు: రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ, రహానే, భరత్, జడేజా, థాకూర్, ఉమేశ్ యాదవ్, షమీ, సిరాజ్