సలాహ్ (ఒమన్): మహిళల హాకీ ఆసియా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఒమన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7-2తో థాయ్లాండ్ను చిత్తుచేసింది. దీంతో పాటు వచ్చే ఏడాది జరుగనున్న 5ఎస్ హాకీ ప్రపంచకప్నకు మన అమ్మాయిల జట్టు అర్హత సాధించింది. తుదిపోరులో భారత్ తరఫున మరియానా (2వ, 8వ నిమిషాల్లో), జ్యోతి (10వ, 27వ ని.ల్లో) డబుల్ గోల్స్తో సత్తాచాటగా.. మోనిక (7వ ని.లో), కెప్టెన్ నవ్జ్యోత్ కౌర్ (23వ ని.లో), మహిమ (29వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.