న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో టీ20, టెస్టుల కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శుక్రవారం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. సీనియర్లకు తోడు జూనియర్ల మేళవింపుతో టీమ్ఇండియా సమతూకంగా కనిపిస్తున్నది. ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఈ నెల 6 నుంచి మొదలుకానుంది.
మరోవైపు వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న కర్ణాటక లెఫ్ట్హ్యాండర్ శుభా సతీష్ను టెస్టు జట్టులోకి తీసుకున్నారు. జట్టుకు హర్మన్ప్రీత్కౌర్ కెప్టెన్గా, స్మృతి మంద న వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.