ముంబై: సుదీర్ఘ ఫార్మాట్లో కంగారూలపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు.. వన్డేల్లో పూర్తిగా తేలిపోయింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 0-3తో కోల్పోయింది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 190 పరుగులతో టీమ్ఇండియాను ఓడించి సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఓపెనర్ లిచ్ఫీల్డ్ (119; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అలీసా హీలీ (82; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్కు 189 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3, అమన్జ్యోత్ కౌర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హర్మన్ బృందం 32.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. మంధన (29) టాప్ స్కోరర్ కాగా.. జెమీమా (25), దీప్తి శర్మ (25) కాస్త పోరాడారు. లిచ్ఫీల్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.