Asian Games | చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ మరో మెడల్ను ఖరారు చేసుకున్నది. మహిళల క్రికెట్లో (Woment Cricket) భాగంగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను (Bangladesh) స్మృతి మంధాన్న (Smriti Mandhana) నేతృత్వంలోని టీమ్ఇండియా (Team India) చిత్తుచేసింది. హాంగ్జౌలోని ఝెజియాంగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ క్రికెట్ ఫీల్డ్లో జరిగిన సెమీస్లో బంగ్లా బ్యాటర్లు 17 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలారు. పేస్బౌలర్ పూజా (Pooja Vastrakar) బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించింది. 17 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసింది.
52 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించారు. ఒపెనర్లు స్మృతి (7), షఫాలీ వర్మ (17) నిరాశ పరిచినప్పటికీ.. జెమీమా రోడ్రిగ్స్, కనికా నాటౌట్గా నిలిచి 8.2 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తిచేశారు. దీంతో టీమ్ఇండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్లో గెలిస్తే భారత్కు బంగారు పతకం లభించనుంది. సోమవారం జరుగనున్న ఫైనల్లో స్మృతి సేన.. శ్రీలంక లేదా పాక్తో అమీతుమీ తేల్చుకోనుంది.