ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన భారత్, ఐర్లాండ్ మ్యాచ్లో విజయం టీమిండియానే వరించింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెలరేగిన దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు 225 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కూడా అద్భుతంగా పోరాడింది. పాల్ స్టిర్లింగ్ (40), ఆండీ బాల్బిర్నీ (60), హ్యీరీ టెక్టర్ (39), జార్జ్ డాక్రెల్ (34 నాటౌట్), మార్క్ అడైర్ (23 నాటౌట్) అదరగొట్టారు. దాంతో భారత్పై ఐర్లాండ్ గెలిచేలాగే కనిపించింది. అయితే చివరి ఓవర్లో భారీ షాట్లు ఆడే అవకాశం పెద్దగా ఇవ్వని ఉమ్రాన్ మాలిక్.. భారత్ను విజయతీరాలకు చేర్చాడు.
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రెండు టీ20ల ఐర్లాండ్ సిరీస్ 2-0తో భారత్ వశమైంది. సెంచరీతో చెలరేగిన దీపక్ హుడాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.