BCCI | కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వెస్టిండీస్తో వచ్చే నెలలో జరిగే ఒక వన్డే, టీ-20 మ్యాచ్లను రెండు నగరాలకే పరిమితం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సిరీస్కు భారత్ ఆతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తొలుత ఆరు నగరాల్లో నిర్వహించాలని రెండు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వల్ల బయో సెక్యూరిటీ రిస్క్ను తగ్గించడానికి ఈ సిరీస్ను రెండు నగరాలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు శనివారం బీసీసీఐ తెలిపింది.
జైపూర్, విశాఖపట్నం, కటక్, తిరువనంతపురం, కోల్కతా, అహ్మదాబాద్ నగరాల్లో నిర్వహించాలని తొలుత నిర్ణయించాయి. తాజా నిర్ణయం ప్రకారం అహ్మదాబాద్లో వన్డే మ్యాచ్, కోల్కతాలో టీ-20 మ్యాచ్లు జరుపనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. బయో సెక్యూరిటీ ముప్పు తగ్గించడంతోపాటు జట్లు, మ్యాచ్ అధికారులు, బ్రాడ్ కాస్టర్లు, ఇతర భాగస్వాముల ప్రయాణాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 6-20 మధ్య ఈ రెండు సిరీస్లు జరుగుతాయి.