WestIndies Vs India 3rd T-20 | టాస్ గెలిచి బౌలింగ్ దిగిన టీం ఇండియా బౌలర్లను వెస్టిండీస్ ఓపెనర్లు గట్టిగానే ఎదుర్కొంటున్నారు. తొలి ఓవర్లో సింగిల్తో సరిపెట్టిన వెస్టిండీస్ బ్యాట్స్మన్లు.. రెండో ఓవర్ నుంచే విజృంభిస్తున్నారు. భువనేశ్వర్ బౌలింగ్ను చెండాడుతున్నారు. రెండో ఓవర్లో ఒక ఫోర్తో బ్రాండన్ కింగ్ పరుగుల వేట ప్రారంభించాడు.. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేశారు. బ్రాండన్ కింగ్ 11, క్లే మేయర్స్ 29 పరుగులతో క్రీజ్లో కొనసాగుతున్నారు.
అంతకుముందు వెస్టిండీస్తో మంగళవారం జరుగున్న మూడో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ టాస్ గెలుచుకున్నాడు. అయితే వెస్టిండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. బాసెటెర్రెలోని వార్నర్ పార్క్లో ఈ టీ-20 మ్యాచ్ జరుగుతున్నది. ఐదు టీ-20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో వెస్టిండీస్, టీం ఇండియా చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. దీంతో సిరీస్ 1-1 తేడాతో సమమైంది. మూడో టీ-20లో రవీంద్ర జడేజా స్థానంలో దీపక్ హుడా వచ్చాడు.