IND vs SL : భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఆవిష్క ఫెర్నాండో అవుట్ అయ్యాడు. అంతకు ముందు ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా (15) అర్షదీప్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగాడు. ఫామ్లో ఉన్న ఓపెనర్ కుశాల్ మెండిస్ (23)ను అక్షర్ పటేలో బొల్తా కొట్టించాడు. 229 టార్గెట్తో బరిలోకి దిగిన లంకకు కుశాల్ మెండిస్, ప్రథుమ్ నిస్సంకా ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీళ్లిద్దరూ 44 పరుగులు జోడించారు. ప్రస్తుతం ధనంజయ డిసిల్వా 14, అసలంక 19 రన్స్తో క్రీజులో ఉన్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 228 పరుగులు చేసింది. సూర్య 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీమిండియా బ్యాటర్లలో శుభ్మన్ గిల్ 46, రాహుల్ త్రిపాఠి 35 పరుగులతో రాణించారు. చివర్లో అక్షర్ పటేల్(21) విధ్యంసం సృష్టించాడు.