ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు ధవన్, గిల్ శుభారంభం అందించారు. నిలకడగా ఆడిన ఇద్దరు బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. అయితే ఇన్నింగ్స్ 23వ ఓవర్లో గిల్ రూపంలో భారత్ తన మొదటి వికెట్ను కోల్పోయింది. కివీస్ ఆటగాడు ఫెర్గూస్ బౌలింగ్లో గిల్ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో వన్డేలో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న గిల్ 50 (64) పెవిలియన్ చేరాడు.
మంచి ఊపుమీదున్న కెప్టెన్ ధవన్ కూడా తర్వాతి ఓవర్లోనే టిమ్ సౌథీ ఔట్ చేశాడు. 72 పరుగులు చేసిన ధవన్.. ఇన్నింగ్స్ 24.3 ఓవర్లో 124 రన్స్ వద్ద అలెన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుత శ్రేయస్ అయ్యర్ 11 (16), రిషభ్ పంత్ 8 (14) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టీమ్ఇండియా 29 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 143 రన్స్ చేసింది. న్యూజిలండ్ బౌలర్లలో టిమ్ సౌతీ, ఫెర్గూసన్ ఒక్కోవికెట్ చొప్పున తీశారు.