లండన్: లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ను టీం ఇండియా మట్టి కరిపించింది. ఐదో రోజు సోమవారం 272 పరుగుల విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ను టీం ఇండియా టెయిలెండర్లు 120 పరుగులకే ఆలౌట్ చేసి, చిరస్మరణ విజయం సాధించారు. ఇంగ్లండ్కు చెందిన 6 వికెట్లు మహ్మద్ సిరాజ్ ఖాతాలో చేరిపోయాయి.
దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో టీం ఇండియా 1-0 ఆధిక్యం సాధించింది. క్రికెట్ మక్కా మైదానంగా పేరొందిన లార్డ్స్ మైదానంలో 89 ఏండ్లలో టీం ఇండియాకు మూడో విజయం. ఈ మైదానంలో టీం ఇండియా 19 టెస్టులు ఆడింది. ట్రెంట్ బ్రిడ్జిలో జరుగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.