ఢాకా: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో బంగ్లా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. జట్టు స్కోరు 50 పరుగులకు కూడా చేరకముందే భారత్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. తొలి 10 ఓవర్లలోనే బంగ్లా బౌలర్లు సత్తాచాటి భారత టాప్ ఆర్డర్ నడ్డి విరిచారు.
జట్టు స్కోరు 23 పరుగల వద్ద స్కిప్పర్ శిఖర్ ధవన్ (7) ఔటయ్యాడు. మెహిదీ హసన్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నట్లుగానే కనిపించినా 11వ ఓవర్ రెండో బంతికి జట్టు స్కోరు 48 పరుగులు ఉన్నప్పుడు రోహిత్ శర్మ (27) క్లీన్ బౌల్డయ్యాడు.
ఆ తర్వాత రెండు బంతులకే అంటే 11వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లీ కవర్స్ మీదుగా షాట్ ఆడబోయి బంగ్లా తాత్కాలిక కెప్టెన్ లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చాడు.