ముంబై: ఇంగ్లండ్తో జరుగనున్న తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు. ఓవైపు సీనియర్లను కొనసాగిస్తూనే యువ వికెట్కీపర్, బ్యాటర్ ధృవ్ జురెల్కు సెలెక్షన్ కమిటీ అవవకాశం కల్పించింది. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 22 ఏండ్ల జురెల్ మిడిలార్డర్లో దూకుడుగా ఆడటంలో సిద్ధహస్తుడు. రంజీ మ్యాచ్లో గాయపడ్డ యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు జట్టులో చోటు దక్కించుకోలేదు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఈ నెల 25 నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు జరుగనుంది.