జార్జ్టౌన్: అండర్-19 ప్రపంచకప్లో యువ భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-‘బి’లో భాగంగా జరిగిన మొదటి పోరులో టీమ్ఇండియా 45 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యంగ్ఇండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ యష్ (82; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. తెలుగు ఆటగాడు షేక్ రషీద్ (31), కౌషల్ (35) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. బ్రేవిస్ (65) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విక్కీ ఓస్తాల్ (5/28), రాజ్ బవా (4/47) దుమ్మురేపారు. తదుపరి మ్యాచ్లో బుధవారం ఐర్లాండ్తో భారత్ తలపడనుంది.