ముంబై : వరల్డ్ చాంపియన్ భారత జట్టు ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆఫ్రికా దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను టీమ్ఇండియా.. జింబా బ్వే పర్యటనకు వెళ్లనున్నట్టు బుధవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవలే పొట్టి ప్రపంచకప్ను వరుసగా రెండోసారి దక్కించుకున్న భారత్.. చివరిసారిగా 2024లో జిం బాబ్వే టూర్కు వెళ్లింది. ప్రపంచకప్ విజయం తర్వాత టీమ్ఇండియాకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జులై 23, 25, 26 తేదీల్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్లు జరుగుతాయి.