న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జుట్ట జింబాబ్వేలో పర్యటించబోతున్నది. ఆగస్టులో జింబాబ్వేతో టీమ్ఇండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
హరారే వేదికగా వచ్చే నెల 18, 20, 22 తేదీల్లో జరిగే మ్యాచ్లకు భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించే అవకాశముంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగంగా మొత్తం 13 జట్లు బెర్తు కోసం పోటీపడుతున్నాయి.