FIH Junior World Cup : భారత హాకీ అభిమానులకు గుడ్ న్యూస్. మన గడ్డపై త్వరలోనే మరో విశ్వ సమరం జరుగనుంది. ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ వరల్డ్ కప్(FIH Mens Junior World Cup) టోర్నీకి ఇండియా ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (FIH) భారత్కు అప్పగించింది. ఈ విషయాన్ని మంగళవారం భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ (Dilip Turkey) తెలిపాడు.
‘ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ పోటీల ఆతిథ్య హక్కులను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈసారి భారత్కు అప్పగించింది. ఈ సందర్భంగా ఎఫ్ఐహెచ్, ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు డాటో టయ్యాబ్ ఇక్రమ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రపంచ హాకీలో భారత పురోగతికి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కొలమానం కానుంది. అంతేకాదు హాకీ అభివృద్ధి కోసం మేము పడుతున్న తాపత్రయం భావి తరాలకు తెలియనుంది. సుదీర్ఘ హాకీ చరిత్ర కలిగిన భారత గడ్డపై యువ ఆటగాళ్ల ప్రతిభను వీక్షించేందుకు ఎదురుచూస్తున్నాం’ అని టర్కీ వెల్లడించాడు.
వచ్చే ఏడాది డిసెంబర్(2025)లో ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ షురూ కానుంది. ఈసారి రికార్డు స్థాయిలో టైటిల్ కోసం ఏకంగా 24 జట్లు పోటీ పడుతుండడం విశేషం. నిరుడు మలేషియా ఈ ఈవెంట్కు ఆతిథ్యమిచ్చింది. ఆద్యంత ఆసక్తిగా జరిగిన ఆ టోర్నీలో జర్మనీ విజేతగా నిలిచింది. గతంలో మూడు సార్లు ఇండియాలో ఈ టోర్నీ జరిగింది. 2013, 2016, 2021లో భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చిం