Davis Cup : డేవిస్ కప్ ప్లే ఆఫ్స్లో పాకిస్థాన్ను చిత్తుగా ఓడించిన భారత బృందం వరల్డ్ గ్రూప్ 1 టై(World Group 1 Tie)కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాయాదిని 4-0తో మట్టికరిపించిన టీమిండియా సెప్టెంబర్లో బలమైన స్వీడెన్(Sweden)ను ఢీకొట్టనుంది. అయితే.. ఇప్పటివరకూ ఈ టోర్నీలో ఒక్కసారి కూడా భారత జట్టు స్వీడెన్ను ఓడించలేదు. దాంతో, ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తారా? లేదా? అని అందరిలో ఆసక్తి నెలకొంది.
అరవై ఏండ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత డేవిస్ కప్ జట్టు చరిత్ర సృష్టించింది. 3-0 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి వరల్డ్ గ్రూప్-1 టైలో చోటు దక్కించుకుంది. ఇస్లామాబాద్లో జరిగిన సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీలు.. డబుల్స్లో యూకీ బాంబ్రీ – సాకేత్ మైనేని.. 6-2, 7-6 (5) తేడాతో పాక్ జోడీ ముజామిల్ ముర్తజా – అకీల్ ఖాన్ల జోడీని ఓడించింది.