Surya Kumar | టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాక్ను మరోసారి లైట్గా తీసుకున్నాడు. కనీసం ఆ దేశం పేరును చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. ఆసియా కప్ గ్రూప్ దశను భారత్ అద్భుతంగా ముగించింది. హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. చివరి గ్రూప్ మ్యాచ్లో ఒమన్ను 21 పరుగుల తేడాతో ఓడించింది. భారత్ ఇప్పటికే సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను మరోసారి ఢీకొట్టబోతున్నది.
ఆసియా కప్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత యూఏఈని తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత పాకిస్థాన్ను ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అయితే, మూడవ మ్యాచ్లో ఒమన్పై గెలిచేందుకు మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే, మ్యాచ్లో టీమిండియా పలు ప్రయోగాలు చేసింది. సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు బ్యాటింగ్కు రాలేదు. బౌలింగ్లోనూ భారత జట్టు ఎనిమిది బౌలర్లను ఉపయోగించుకుంది.
ఒమన్తో మ్యాచ్ అనంతరం.. పాకిస్థాన్తో ఆదివారం జరిగే మ్యాచ్పై మీడియా సూర్యకుమార్ యాదవ్ను ప్రశ్నించింది. అయితే, తాము సూపర్ 4 కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా ఆ జట్టు పేరును చెప్పేందుకు సైతం ఇష్టపడలేదు. గ్రూప్ స్టేజ్లో పాక్తో మ్యాచ్ రోజున కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేయకపోవడం పోవడం తెలిసిందే. దాంతో పెద్ద వివాదమే చెలరేగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత సైతం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా ఒమన్ జట్టును టీమిండియా కెప్టెన్ అభినందించారు. ఒమన్ భారత బౌలర్లను బాగా ఎదుర్కొన్నారంటూ బ్యాట్స్మెన్ను ప్రశంసించాడు. సూర్య మాట్లాడుతూ రాబోయే మ్యాచ్లో తప్పనిసరిగా తాను టాప్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒమన్ అద్భుతమైన క్రికెట్ ఆడిందని తాను భావిస్తున్నానన్నాడు. వారి బ్యాటింగ్ చేయడం చూడటం నిజంగా బాగుందన్నాడు. అయితే, అర్ష్దీప్, హర్షిత్ రాణా గురించి మాట్లాడుతూ బెంచ్పై కూర్చొని అకస్మాత్తుగా జట్టులోకి వచ్చిన తుదిజట్టులోకి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒమన్ ఆటగాళ్లతో మాట్లాడి వారిని కౌగిలించుకున్నాడు. హార్దిక్ కూడా అలాగే చేస్తూ కనిపించాడు. సూర్యకుమార్ ప్రత్యర్థి జట్టు సభ్యులతో ఫొటోలు దిగడం విశేషం.