దుబాయ్ : ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకుల్లో భారత జట్టు మూడో స్థానం దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నప్పటికీ 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ (102)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ర్యాంకుల్లో నిరుడు మే నుంచి ఆడిన అన్ని మ్యాచ్లను కలుపుకుని జట్లకు వెయిటేజీ ఇవ్వగా ఆస్ట్రేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
దక్షిణాఫ్రికా (119) రెండో స్థానంలో ఉంది. టాప్-10లో న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉండగా ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ నిలిచాయి. మహిళల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లోనూ ఆసీస్ (163 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా ఇంగ్లండ్, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో ఉన్నాయి.