కాన్పూర్: రవీంద్ర జడేజా టెస్టుల్లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 17వ హాఫ్ సెంచరీ. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇవాళ జడేజా 99 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. అయిదో వికెట్కు అయ్యర్తో కలిసి జడేజా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరి మధ్య అయిదో వికెట్ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఇవాళ ఉదయం తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు గౌరవప్రదమైన స్కోర్ను సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 258 రన్స్ చేసింది. వెలుతురు సరిగా లేని కారణంగా కేవలం 84 ఓవర్లు మాత్రమే వేశారు. ఇండియన్ ఇన్నింగ్స్లో శుభమన్ గిల్, జడేజా, అయ్యర్లు హాఫ్ సెంచరీలు చేశారు. తొలి టెస్టు ఆడుతున్న అయ్యర్ 75, జడేజా 50 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమిసన్ మూడు వికెట్లు తీసుకోగా.. సౌథీ ఖాతాలో ఒక వికెట్ చేరింది.