Parveen Hooda | ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో కోటా దక్కించుకున్న భారత యువ బాక్సర్ పర్వీన్ హుడాపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) 22 నెలల నిషేధం విధించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్యకాలంలో డోప్ టెస్టులలో భాగంగా తన ఆచూకీని తెలియజేయనందుకు గాను వాడా ఆమెపై చర్యలకు ఉపక్రమించింది.
రిజిష్టర్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)లో భాగంగా అథ్లెట్లు ప్రతి త్రైమాసికానికి తాము ఎక్కడున్నామన్నది సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలి. వాడా నిబంధనల ప్రకా రం 12 నెలల వ్యవధిలో మూడుసార్లు విఫలమైతే వారు నిబంధనలను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. పర్వీన్పై నిషేధంతో 57 కిలోల విభాగంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) కొత్త ట్రయల్స్ నిర్వహించనుంది.