బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ 20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత జట్టు మూడు టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ (61 పరుగులు)సాధించినా జట్టుని జట్టుని గెలిపించలేకపోయాడు. ఆల్ రౌండర్ దీపక్ హుడా నాలుగు వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీశారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్కు తలా ఒక వికెట్ దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్య కుమార్ యాదవ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 13 పరుగలకే ఔట్ అయ్యాడు. దీపక్ హుడా, వాషింగ్టన్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. సౌథీ హ్యాట్రిక్ సాధించాడు. సెంచరీతో జట్టుకి భారీ స్కోర్ అందించిన సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.