సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా(Team India) ఇన్నింగ్స్ 32 రన్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్లో మరీ నెమ్మదిగా బౌలింగ్ చేసిన రోహిత్ సేనకు జరిమానా విధించింది ఐసీసీ. అంతేకాదు, ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో కీలకమైన రెండు పాయింట్లను కూడా టీమిండియా కోల్పోయింది. సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా బౌల్ చేసింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధించారు. టార్గెట్ లోపు భారత్ రెండు ఓవర్లు తక్కువగా బౌల్ చేసిందని, అందుకే జరిమానా విధించామని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రెఫరీ క్రిస్ బోర్డు తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయకుంటే, ఆర్టికల్ 2.22 ఐసీసీ ప్రవర్తనా నియమావళి కింద ఆటగాళ్లపై 5 శాతం ఫీజు కోత విధిస్తారు.
🚨 JUST IN: India have been penalised for slow over rate during the first #WTC25 Test against South Africa.
Details ⬇️https://t.co/dSqixki92Z
— ICC (@ICC) December 29, 2023
తొలి టెస్టులో ఓడిన ఇండియా ఐసీసీ పాయింట్ల పట్టికలో కీలక పాయింట్లను కోల్పోయింది. 16 పాయింట్లతో ఇండియా అయిదో స్థానంలో నిలిచింది. పాయింట్ల శాతం 44.44 గా ఉంది. ఇక స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లను తగ్గించడంతో.. స్టాండింగ్స్లో ఇండియా పొజిషన్ మారింది.