కేప్టౌన్ : క్రీడ ఏదైనా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లో ముఖాముఖి తలపడనున్నాయి. ఐసీసీ టైటిల్ సాధనలో తడబడుతున్న భారత జట్టు ఈసారి ప్రపంచకప్ను గెలవాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసం ఆదివారం దాయాది పాకిస్థాన్తో పోరు ఆరంభించనున్నది. ఇరు జట్లలో భారత్దే పైచేయిగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న భారత జట్టు నిర్వివాదంగా మెరుగైన జట్టుగా పోటీలోకి దిగనున్నది.
సోమవారం మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ఉన్నందున మహిళా క్రికెటర్ల దృష్టి అటు మళ్లే అవకాశముంది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వెన్ను నొప్పితో, బ్యాటర్ స్మతి మందన వేలి గాయంతో సతమతమవుతుండడం జట్టును కలవరపరుస్తున్నది. ఆదివారంనాటి మ్యాచ్కు వీరిద్దరు ఆడేది అనుమానంగా ఉంది. భారత పేస్ బౌలర్లలో రేణుక సింగ్ మినహా తతిమావారు ప్రభావం చూపలేకపోతున్నారు.