Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. థామస్ కప్ కైవసానికి భారత్ అడుగు దూరంలో ఉంది. ఫైనల్ మూడో మ్యాచ్లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీతో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ తలపడుతున్నాడు. 21-15 తేడాతో తొలి గేమ్ను శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. జొనాథన్ క్రిస్టీపై కిదాంబి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
ఫైనల్ చేరే క్రమంలో మలేషియా, డెన్మార్క్పై అద్భుత విజయాలు సొంతం చేసుకుంది భారత బృందం. ముఖ్యంగా సీనియర్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ భారమంతా నెలకొని ఉంది. గత రెండు మ్యాచ్ల్లో జట్టుకు అద్భుత విజయాలు అందించడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించారు.