World Test Championship final: భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18-22 వరకు జరగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా లేదా టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. ఆరంభ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభ ఎడిషన్కు సంబంధించిన నిబంధనలు, షరతులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగే తుదిపోరు డ్రా లేదా టైగా ముగిస్తే భారత్, న్యూజిలాండ్ను జాయింట్ విన్నర్లుగా ప్రకటిస్తారు. జూన్ 23వ తేదీని ఐసీసీ ఇప్పటికే రిజర్వ్ డేగా కేటాయించింది.
ఐదు రోజుల మ్యాచ్లో ఏదైనా కారణంతో ఆటకు ఆటంకం కలిగితే నష్టపోయిన ఆట సమయాన్ని రిజర్వ్ డే రోజు ఉపయోగిస్తారు. మ్యాచ్ జరుగుతున్న రోజుల్లో సమయం కోల్పోయిన సందర్భంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఎప్పటికప్పుడు ఇరు జట్లకు తెలియజేస్తాడు. కోల్పోయిన సమయానికి అనుగుణంగానే రిజర్వ్డేను ఎలా ఉపయోగించుకోవాలో అప్డేట్ చేస్తాడు. మ్యాచ్లో గ్రేడ్ 1 డ్యూక్స్ బంతులను ఉపయోగిస్తారు. ఈ నిర్ణయాలను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభానికి ముందు జూన్ 2018లోనే తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్లో ఉన్న టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనుంది.