ముంబై : టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీని టోర్నీకి ఎంపిక చేసింది. అయితే, స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తీసుకుంది.
భారత జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మెంటార్గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉండగా టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి యూఏఈలోని నాలుగు వేదికల్లో జరుగనుంది. మస్కట్ దుబాయి, అబుదాబి, షార్జాలో మ్యాచ్లు జరుగనున్నాయి. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ గతేడాది అక్టోబర్ 15 – నవంబర్ 15 మధ్య భారత్లో జరుగాల్సి ఉంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తాత్కాలికంగా టోర్నీని ఐసీసీ వాయిదా వేసింది. మరోసారి కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో టోర్నీ వేదికను భారత్ నుంచి యూఏఈకి మార్చారు.