ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు మరో స్వర్ణ పతకం సాధించింది. ఈ మెగా టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం అద్భుతంగా రాణించిన భారత పురుషుల జట్టు ఏకంగా స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబుతా, కిరణ్ జాదవ్ త్రయం.. చైనా బృందాన్ని ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కైరో వేదికగా ఆదివారం నాడు జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఈ పోటీలు జరిగాయి.
ఈ టోర్నీలో భారత్కు ఇది ఐదో స్వర్ణ పతకం కావడం గమనార్హం. ఫైనల్లో చైనాపై 16-10 తేడాతో భారత బృందం విజయం సాధించింది. అదే సమయంలో భారత మహిళల బృందం కూడా ఈ టోర్నీలో రాణించింది. మెహులి ఘోష్, ఎలావెనిల్ వలరివన్, మేఘనా సజ్జనార్ బృందం జర్మనీ జట్టును 17-11 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.