మ్యాచ్ చివర్లో కూడా భారత్ కష్టాల్లో పడిపోయింది. భారత్ను ఓవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకుంటున్నా.. ఇతర ప్లేయర్ల వికెట్లు డౌన్ అవుతుండటంతో భారత్కు పరుగులు చేయడం కష్టంగా మారుతోంది. కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడని సంతోష పడేలోపే.. జడెజా ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 5 వికెట్లను నష్టపోయింది.
13 బంతుల్లో 13 పరుగులు చేసి జడెజా పెవిలియన్ బాట పట్టాడు. హసన్ అలీ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి రవీంద్ర జడెజా ఔట్ అయ్యాడు. 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ స్కోర్ 125. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 55 పరుగులు చేశాడు.